►పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి.
►లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
►దీంతో స్పీకర్ వారిని వారించారు. అనంతరం జీ20 సదస్సు విజయవంతమవడంపై స్పీకర్ అభినందనలు తెలియజేశారు.
►‘జీ 20 సదస్సు విజయవంతం చేసిన ప్రధాని మోదీకి అభినందనలు.
►జీ20 ద్వారా మన ప్రజాస్వామ్య శక్తి ప్రపంచానికి తెలిసింది.
►మోదీ విజన్, సమర్థత వల్లే ఇదంతా సాధ్యమైంది’ అని స్పీకర్ కొనియాడారు.
►గాంధీజీ ప్రబోధించిన శాంతి, అహింస మనకు ఎప్పుడూ స్పూర్తినిస్తుంటాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
►డిజిటలైజేషన్ దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందంటూ డిజిటల్ ఇండియా గురించి ప్రస్తావించారు.
►ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందంటూ.. వివిధ రంగాల్లో దేశం సాధిస్తోన్న పురోగతి గురించి వెల్లడించారు.
0 Comments